తన ఇంటికి YCP కార్యాలయం అని బోర్డ్ పెట్టిన‌ దువ్వాడ..!

-

దువ్వాడ శ్రీనివాస్.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికి బాగా తెలిసిన పేరు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ సమస్య రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి.. తన భర్తపై అలాగే మాధురిపై చేసిన ఆరోపణలతో ఈ ఫ్యామిలీ సమస్యలు మీడియాకు చేరాయి. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటుంది ఇంటిని తమకు ఇవ్వాలని వాణి అలాగే ఆమె కూతుర్లు అంటున్న విషయం తెల్సిందే.

కానీ ఈ దువ్వాడ ఫ్యామిలీ ఇష్యులో మరో ట్విస్ట్ వచ్చింది. దువ్వాడ నివాసం ఉంటున్న తన కొత్త ఇంటికి YCP కార్యాలయం అని బోర్డ్ పెట్టాడు. అయితే ఈ సమస్య మొత్తం ఆ ఇంటి చుట్టూనే నడుస్తుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటిలోకి తనను అనుమతించాలంటూ గత 12 రోజులుగా దువ్వాడ వాణి నిరసన దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంగా బోర్డు రావడంతో సర్వత్ర చర్చనీయాంశం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news