కోడికత్తి దాడిలో జగన్ కూడా కోర్టుకు రావాల్సిందే – NIA కోర్టు ఆదేశం

-

ఏపీ సీఎం జగన్‌ కు మరో షాక్‌ తగిలింది. కోడికత్తి దాడిలో జగన్ కూడా కోర్టుకు రావాల్సిందేనని తాజాగా NIA కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ తరుణంలో… మొదటి సాక్షి దినేష్ కుమార్ గైర్హాజరు అయ్యాడు.

దినేష్ కుమార్ తండ్రి మరణించడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని తెలిపాడు దినేష్ తరుపు న్యాయవాది. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది NIA కోర్టు. కొత్త షెడ్యూల్ ఇవ్వాలని, బాధితుడు జగన్ సైతం తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 3 వ సాక్షిగా జగన్ పీఏ నాగేశ్వర రెడ్డి సైతం హాజరు కావాలన్న ఎన్ఐఏ కోర్టు.. ఫిబ్రవరి 15వ తేదీలోగా వీరి రాకకు సంబందించి మెమో జారీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news