గోదావరి వరదలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే..

-

తెలుగుదేశం నరసాపురం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోదావరి వరదలో చిక్కుకున్నారు. భారీ వర్షాల వలన గోదావరికి వరదలు రావడంతో పలు లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో ఆయన ముంపు గ్రామాలను పరిశీలించేందుకు అధికారులతో కలిసి వెళ్లారు. అయితే ఆయన బోటు వశిష్ట గోదావరిలో ఆగిపోయింది. యలమంచిలి మండలం చించినాడ వద్ద వరద తీవ్రతకు మరబోటు నిలిచిపోయిందని అంటున్నారు.

అయితే వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది బోటును పక్కనే ఉన్న చెట్టుకు కట్టారని అంటున్నారు. ప్రస్తుతం బోటులో ఎమ్మెల్యేతో పాటు మరో 8 మంది ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోసం పర్యాటక శాఖకు చెందిన బోట్ పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బోటు కోసం ఎమ్మెల్యే ఆ ఎనిమిది మందితో నదిలోనే వేచి ఉన్నారు. ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news