నూతన్ నాయుడు మామూలోడు కాదు : మాజీ ఐఏఎస్ పేరుతో పలువురికి టోకరా !

-

నూతన్ నాయుడు గురించి అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట నూతన్‌ నాయుడు పలువురు అధికారులను మోసగించినట్లు గుర్తించారు పోలీసులు. పీవీ రమేష్ పేరిట గాజువాడ ట్రాఫిక్ పోలీసులకూ నూతన్‌నాయుడు ఫోన్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇక నూతన్ నాయుడు రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ పేరు మీద కొంత మందికి కాల్ చేసి తన సొంత పనులు చేసుకోవాలని చూసినట్టు గుర్తించారు.

కేజీహెచ్ సూపరింటెండెంట్ కి కూడా పి వి పేరుమీద కాల్ చేసినట్టు తెలుస్తోంది. సుధాకర్ గారితో పాటు మరో ముగ్గురు విశాఖ వైద్యులకు కాల్ చేసినట్టు గుర్తించారు. ఇక ఈయన ముంబైకి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నామని విశాఖ సీపీ మనీష్ కుమార్ ప్రకతిచారు. కర్నాటకలోని ఉడిపి లో అరెస్ట్ చేసామన్న సీపీ నాయుడు వద్ద మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని కర్ణాటక కోర్టుల హాజరు పరిచామని అన్నారు. నూతన నాయుడు ప్రస్తుతo కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని వైజాగ్ తీసుకొస్తామని సీపీ మనీష్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news