ఏపీలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..అవి కూడా ఇకపై ఉచితమే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అలాగే బ్యాగులు పంపిణీ చేసేందుకు అధికారులు.. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏపీలో ఇలా ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వారు లక్షకు పైగా ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ సెకండియర్ వారు 92,134 మంది ఉండడం జరిగింది.

Officials have made all arrangements to distribute free books and bags to inter students studying in government junior colleges

వారందరికీ పుస్తకాలను ఫ్రీగా అందించనున్నారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలతో పాటు సంబంధిత గ్రూప్ పాఠ్యపుస్తకాలు అలాగే బ్యాగ్ కూడా పంపిణీ చేయబోతుంది ఏపీ సర్కార్. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల కేంద్రాలకు అలాగే మండలాల కేంద్రాలకు పుస్తకాలు, కాలేజీ బ్యాగులు చేరిపోయాయి అని అధికారులు ప్రకటించారు. ఇక వీటిని అతి త్వరలోనే విద్యార్థులకు అందజేయనుండి చంద్రబాబు ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news