ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో… తెల్లవారుజామన ఎదురుకాల్పులు..!

-

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వారం తిరగకుండానే మరోసారి తూటాలు పేలాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా సరిహద్దు గుజ్జెడికి సమీపంలో కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. విశాఖ మన్యం సమీపంలో ఈ నెలలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగడం ఇది మూడో సారి.

maoists
maoists

ఈ నెల 16 న ఒడిశా సరిహద్దుల్లో, ఈ నెల 19న విశాఖ మన్యం గిన్నెలకోట పంచాయతీ లండుల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జులై 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఉన్నందున ఎదురు కాల్పుల ఘటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news