చిత్తూరు జిల్లాలో మరో కారు గల్లంతు

-

చిత్తూరు జిల్లా శ్రీరంగపురంలో మరో కారు గల్లంతయ్యింది. దుర్గపురంలోని తెల్లగుండ్లపల్లె వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అయితే వెంటనే కారులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు నలుగురు యువకులు. ముందు ప్రవాహ వేగాన్ని అంచనావేయకుండా ముందుకు పోనించాడు డ్రైవర్‌. అరకిలోమీటర్‌ కారు కొట్టుకుపోయాక డోర్‌లు ఓపెన్‌ చేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు యువకులు. ఇక మరో పక్క చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లె వాగులో గల్లంతైన తండ్రీ, కూతుళ్లలో కూతురి మృతదేహం లభించింది.

తండ్రి ఆచూకి ఇంకా తెలియలేదు. కొండయ్య గారి పల్లె వాగులో ఈ ఉదయం కారు కొట్టుకుపోయింది. వడ్డేపల్లెకు చెందిన ప్రతాప్ కుటుంబంతో కలిసి కలికిరికొండలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ప్రతాప్, భార్య శ్యామల, కుమార్తె సాయి వనిత, వారి బంధువు చిన్నప్ప, డ్రైవర్ కిరణ్‌ ఉన్నారు. కారు ప్రవాహంలో మునిగిపోవడాన్ని గమనించి అద్దాలు పగలగొట్టుకుని శ్యామల, చిన్నప్ప, కారు డ్రైవర్ తప్పించుకున్నారు. ప్రతాప్ కూడా తప్పించుకున్నప్పటికీ కారులో చిక్కుకుపోయిన కూతురిని కాపాడబోయి ఆయన కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news