ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..ఉత్తర్వులు జారీ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఐదు పథకాల పేర్లలో మార్పు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్‌. అమ్మఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది చంద్రబాబు సర్కార్‌. విద్యా కానుక పథకానికి సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్ధి మిత్రగా పేరు మార్పు చేసింది చంద్రబాబు సర్కార్‌.

Orders making changes in the names of 6 schemes being implemented in the school education department of the state

గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్‌. పాఠశాలల్లో నాడు -నేడు కార్యక్రమానికి మన బడి – మన భవిష్యత్ పేరిట పేరు మార్పు చేసింది. స్వేచ్చ పథకానికి బాలికా రక్షగా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్‌… అణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం కింద పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news