మన దేశ ప్రగతిలో వారి పాత్రను ఎవరూ విస్మరించలేరు : పవన్ కళ్యాణ్

-

మన దేశ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగ నిపుణుల పాత్రను ఎవరూ విస్మరించలేరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన ఇంజనీరింగ్ నిపుణులకు మార్గదర్శకులు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారన్న ఆయన ఈ రోజు ఆ మహనీయుని జయంతి.. సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి గట్టెక్కించేలా నీటిపారుదల వ్యవస్థను రూపొందించారని, విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడే విధానాన్ని అందించారని అన్నారు. దేశంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య గారి భాగస్వామ్యం మరువలేనిదని పవన్ పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం వారి జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించుకొంటూ ఉంటామని, విశ్వేశ్వరయ్య గారిలోని తపన, దృఢ సంకల్పం… ఆయన జీవితం యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తాయని పవన్ పేర్కొన్నారు. మన దేశ ఇంజనీర్లు అత్యుత్తమ నైపుణ్యాలతో పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో ముందుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news