ఒడిశా రైలు ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

-

 

ఒడిశా రైలు ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌ కళ్యాణ్‌. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం అన్నారు.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని కోరారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news