నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఆ లేడినే టార్గెట్

-

నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్..పయనం కానున్నాడు. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారం పై నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు పాత తిరుపతి విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జనసైకునికుల బైక్ ర్యాలీ తీయనున్నారు. పాత విమానాశ్రయం నుంచి హైవే మీదుగా, రేణిగుంట జంక్షన్ మీదుగా, గాజులమండ్యం మీదుగా తుమ్మలాగుంట సర్కిల్లో నుంచి మహిళా యూనివర్శిటీ రోడ్డు మీదుగా,వెస్ట్ చర్చి,బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి టౌన్ క్లబ్ వద్దకు చేరుకోనున్నారు పవన్.

ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే పవన్ కళ్యాణ్ కార్యకర్తపై చేయి చేసుకుంది సీఐ అంజు యాదవ్. అయితే, ఇప్పటివరకు అంజూ యాదవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అంజు యాదవ్ వ్యవహారంపై ఇప్పటికే డిజిపి కి నివేదిక పంపడంతో పాటు చార్జ్ మోమె జారీ చేసారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారం పై నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసి, అనంతరం ఢిల్లీ పయనం అవుతాడు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news