శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారికి TSRTC తీపి కబురు

-

TSRTC మరో తీపి కబురు చెప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి TSRTC తీపి కబురు అందించింది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించే వారిలో కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే…టికెట్ చార్జీలో 10% డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది.

క్యాబ్, ఆటోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఇవాళ విద్యాసంస్థలకు సెలవు. బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. నిన్న ఆదివారం, ఇవాళ ప్రభుత్వ సెలవు కావడంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తున్నారు. తిరిగి మంగళవారం అంటే రేపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news