నేడు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్

-

విశాఖ వారాహి విజయ యాత్ర మూడవ రోజు షెడ్యూల్ విడుదల చేసింది జనసేన పార్టీ. ఇందులో భాగంగానే నేడు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్లనున్నారు జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాజీ వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్.

అనంతరం పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంది. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సిరిపురం సి.ఎన్.బి.సి. భూములు పరిశీలించనున్నారు జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్. విశాఖ నగరం నడిబొడ్డున వివాదాస్పద భూముల్లో భారీ నిర్మాణాలు ప్రారంభించారు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ. వాటిపై కూడా జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్…దృష్టిపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news