ఏపీ బంద్‌ పై పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటన

-

ఏపీ బంద్‌ పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. టీడీపీ బంద్ కు జనసేన సంఘీభావం తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్‌. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా టిడిపి తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోందని… ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించిందని వెల్లడించారు పవన్ కళ్యాణ్.

ఆంధ్ర ప్రదేవ్‌ రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందని పేర్కొన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టారని… అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుందని.. ఇవాళ్టి జరగబోయే బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నానన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news