నేడు భీమిలి నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

-

నేడు భీమిలి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనుంది. ఈ సందర్భంగా ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతరం వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news