పవన్ కాపు ద్రోహిగా మిగిలి పోతాడు : కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు

-

పవన్ కాపు ద్రోహిగా మిగిలి పోతాడు అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  కాపులకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి సీఎం జగన్ అన్నారు.  రంగా ఆశయాలను నెరవేరుస్తూ కాపుల మనోభావాలను గౌరవించే వ్యక్తి జగన్ అని..  చంద్రబాబును, టీడీపీని ఓడించేందుకు కాపులు పాటుపడాలి అన్నారు.  కాపులు పూర్తిగా జగన్ వెంటే ఉంటారు.
ఇప్పటికే 70 శాతానికి పైగా కాపులు జగన్ వెంటే ఉన్నారు అని తెలిపారు.

జగన్ కు అండగా ఉండాల్సిన బాధ్యత కాపులది.  పవన్ కి జగన్ అంటే ఎందుకంత ఉక్రోశం అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు చేసినట్టు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు దోపిడీకి గురవుతున్నారా? పవన్ కళ్యాణ్ సీఎం జగన్ స్థాయికి వెళ్లడానికి పవన్ జీవితం మొత్తం సరిపోదు అన్నారు.  అంబేద్కర్, పూలే భావాలు వంగవీటి రంగా ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం జగన్ గురించి పవన్ ఎంత హీనంగా మాట్లాడితే ప్రజలు పవన్  ను అంత హీనంగా చూస్తున్నారు.  పవన్ కళ్యాణ్ నడిచి వెళ్లినా ఎవరూ పట్టించుకోని పరిస్థితికి వెళ్తాడు.  దొంగ మాటలు చెప్పి వంగవీటి కుటుంబాన్ని నమ్మించి చంద్రబాబు మోసం చేశాడు.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఎలా అవమానించాడో చూశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news