పవన్‌ కోర్టులోనే బంతి..బాబుతోనా? బీజేపీతోనా?

-

ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచి పొత్తుకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇక పొత్తుకు అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం సుముఖంగానే ఉన్నారని..అప్పుడప్పుడు వారు చేసి కామెంట్లు బట్టి అర్ధమవుతుంది. అలాగే మధ్యలో ఒకసారి పవన్‌ని బాబు కలిశారు.

ఇక పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని, వైసీపీని ఖచ్చితంగా అధికారంలో నుంచి దించేస్తామని అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు పవన్ ఓకే..కానీ ప్రస్తుతం పవన్..బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీ ఏమో చంద్రబాబుతో పొత్తు వద్దు అని..ముందు నుంచి చెబుతూనే ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకెళ్లడానికి ఇటీవలే బాబు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖమ్మంలో భారీ సభ పెట్టి అక్కడ పార్టీ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటాయని ప్రచారం వచ్చింది.

 

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, కార్యకర్తలకు కూడా అదే చెప్పాలని నేతలకు సూచించారు. ఇలా బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు బంతి పవన్ కోర్టులోకి వచ్చింది. టీడీపీతో కలవాలంటే బీజేపీని కూడా కలుపుని రావాలి. బీజేపీ కలిసేలా లేదు.

దీని వల్ల టీడీపీ కావాలంటే బీజేపీని వదిలేయలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదలడం ఈజీ కాదు. చంద్రబాబే పదే పదే మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీని వదిలి టీడీపీతో కలుస్తారా? అనేది పెద్ద ప్రశ్న. కానీ టీడీపీ-జనసేన కలిస్తేనే వైసీపీకి చెక్ పెట్టగలవు. అందుకే వైసీపీ సైతం..ఆ రెండు పార్టీల పొత్తు లేకుండా చేయాలనే కష్టపడుతుంది. మరి చివరికి పవన్ బీజేపీని కలిపి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? బీజేపీని వదిలి పొత్తు పెట్టుకుంటారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version