సీఎం జగన్ పై పాయకరావుపేట ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

విశాఖ : పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను హింసావాదిని కాదు అహింసా వాదినేనని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం కు నేను వ్యతిరేకం కాదు…వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి నేను వై.ఎస్.ఆర్ పార్టెకి విధేయుడు గానే ఉన్నాను.ఇప్పుడు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నానని వెల్లడించారు. దివంగత నేత ఆకస్మిక మరణం నన్ను కలచి వేసింది.

ఆ బాధతో అప్పట్లో మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని.. 2019 లో నాకు టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది నాపై చాలా రకాలుగా అధిష్టానం కు చెప్పినప్పుకీ నాకు టిక్కెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని చెప్పారు.

అధిష్టానం కష్టాల్లో ఉన్నపుడే వారి వెంట ఉన్న విధేయుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను… నా నియోజకవర్గ కార్యకర్తల్లో ఆవేదన ను తెలిజేసే ప్రయత్నం లో ఇంతకు ముందు హింసావాదిగా ఉండే వాడిని ఇప్పుడు అహింసా వాదిగా మరానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదని వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నా పై కుట్ర పూరిత రాజకీయం జరుగుతున్న మాట వాస్తవమే కానీ నేను వారికి గాని అదిష్టానం కు గాని ఎప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించలేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news