జగన్ మార్పు తప్ప ఎమ్మెల్యే మార్పును ప్రజలు కోరుకోవడం లేదు : మాజీ మంత్రి గంటా

-

రాష్ట్రంలో జగన్ మార్పు తప్ప ఎమ్మెల్యే మార్పును ప్రజలు కోరుకోవడం లేదు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ పతనం మొదలయింది అని..  అది మునిగిపోయే పడవ అన్నారు. భవిష్యత్తులో విశాఖలో మరిన్ని సంచలనాలు ఉండ బోతున్నాయి. సీతంరాజు సుధాకర్, వంశీకృష్ణ యాదవ్ శాంపిల్ మాత్రమే.. భవిష్యత్ లో చాలా మార్పులు జరుగుతాయి అన్నారు.

వైసీపీలో ప్రకంపనలు జగన్మోహన్ రెడ్డి ప్రయాణాన్ని అగమ్య గోచరంగా మార్చేశాయి. వైసీపీలో మెటీరియల్ అయిపోయింది. రాజకీయాల్లో నాయకులు మారడం సహజమే కానీ స్ట్రాటజిస్టులు మారిపోవడం వైసీపీలోనే చూస్తున్నాం అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు అధికార పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతున్నాయో చెబుతున్నారు అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయం అని జ్యోషం చెప్పారు గంటా శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news