సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్!

-

సీఎం జగన్ కు మరో షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారట కొంత మంది దుండగులు. సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు 1902 హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి బెదిరించారని సమాచారం అందుతోంది.

Phone calls saying that they will attack CM Jagan with stones

దీంతో ఏపీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం జగన్‌ ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని వీరు 1902కు కాల్ చేశారు. కాగా ఇప్పటికే విజయవాడలోని ఓ ఏరియాలో… సీఎం జగన్‌ పై రాయితో దాడి చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనలో నిందితుడు సతీస్‌ ఊచలు లెక్కిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news