మునుపెన్నడూ లేని విధంగా జగన్ పర్యటనలో మీడియాకు ఆంక్షలు !

-

జగన్ రాక దృష్ట్యా రేణిగుంట విమానాశ్రయం ప్రాంగణం నుంచి విలేఖరులను పోలీసులు బయటకు పంపి వేశారు. గతంలో ఎన్నడూ జగన్ తిరుపతి పర్యటనలో లేని విధంగా ఈరోజు పోలీసుల తీరు ఉంది. ఎందుకంటే గతంలో కడపకు వెళ్లేటప్పుడు కూడా రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎన్నో సార్లు జగన్ వెళ్ళినా ఎప్పుడూ ఇన్ని ఆంక్షలు పెట్టలేదు. ప్రతి సారీ మీడియాతో మాట్లాడక పోయినా అభివాదం చేస్తూ వెళ్లేవారు జగన్.

అయితే ఈ సారి డిక్లరేషన్ వివాదం నేపధ్యంలో పూర్తి భిన్నంగా ఎప్పుడూ లేని విధంగా మీడియాకు ఆంక్షలు విధించారు.ఇక రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలు దేరిన జగన్, తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద సీఎంకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో పద్మావతి అతిధి గృహం వద్ద నుంచి అన్నమయ్య భవన్ కు చేరుకోనున్న సీఎం హోం మంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిలతో కలిసి కోవిడ్ పై ప్రధాని మోడీతో జరిగే సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news