రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతో వచ్చాయి : సీఎం జగన్

-

మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అభివృద్ధికి సంబంధమే లేదు. సెల్ ఫోన్ కనిపెట్టింది, ఐటీ తీసుకొచ్చింది, సత్య నాదెళ్లను చదివించింది తానేనని చెప్పుకున్నారు. హైపర్ లూప్, బుల్లెట్ ట్రైన్ తెచ్చి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది. హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ ఉంటాడు. శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకొస్తాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news