ఏపీ CID అధిపతిగా PSR ఆంజనేయులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సిఐడి విభాగ అధిపతిగా సీనియర్ IAS అధికారి ఆంజనేయులుకు జగన్‌ ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సిఐడి విభాగా అధిపతి సంజయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కొన్ని రోజులుగా మెడికల్ లీవ్ లో ఉన్నారు.

దీంతో ఆయన స్థానంలో తోలుత శ్రీకాంత్ ను ఇన్చార్జిగా నియమించగా… తాజాగా సిఐడి విభాగం పూర్తి బాధ్యతలను ప్రభుత్వం ఆంజనేయులుకు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.కాగా, ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరుగనుంది. పలు పరిశ్రమల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. GISలో చేసుకున్న MOUల గ్రౌండింగ్ దిశగా చర్చ జరుగనుంది. SIPBలో తీసుకునే నిర్ణయాలకు రేపటి క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news