చంద్రబాబు హయాంలోని ఐదేళ్ల అప్పును జగన్ ఏడాదిలోనే చేశారు..!

-

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో చేసిన అప్పులను, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలోనే చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. పైగా చంద్రబాబు నాయుడు గారి కంటే తామే తక్కువ అప్పులను చేశామని జగన్ మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ సభ్యులు, వైకాపా నాయకులు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.

raghurama-krishnam-raju- on vyugam movie

జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని, ఆయన చేసిన అప్పుల గురించి ప్రశ్నిస్తే తప్పా? అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలోని ఒక పాటను రఘురామకృష్ణ రాజు గారు ఆలపిస్తూ, ఒప్పులకుప్ప… అప్పులకుప్పకు మంచిగా మ్యాచ్ అయిందని అపహస్యం చేశారు. రేపో, మాపో అధికారంలో నుంచి దిగిపోయే వారికి ఆగడాలు ఎక్కువ అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news