భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారు – రఘురామకృష్ణం రాజు

-

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారని చురకలు అంటించారు రఘురామకృష్ణం రాజు.పులివెందులలో పులి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు తమ ఊరు ఉండి, భీమవరంలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేను చులకనగా చూస్తే ఎలా?, మీ చేత తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజకీయాలలోకి రాలేదని, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని, వారిని గౌరవించడం ఇకనైనా నేర్చుకోవాలని, లేకపోతే పరిస్థితులు తిరగబడతాయి అని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చుట్టూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పి ఎ రెడ్డిలు మాత్రమే ఉంటారని, వారంతా లోపల ఉంటే ఎస్సీ బీసీ ఎంపీలు మాత్రం షెడ్డు వంటి చోట కూర్చోవలసిన పరిస్థితిని కల్పించారని, తాను వెళ్ళాక సహచర ఎంపీలను చూసి ఇక్కడ కూర్చున్నారు ఏమిటని ప్రశ్నించగా, లోపల వారంతా ఉన్నారని… ముఖ్యమంత్రి గారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారన్నారు. తాను లోపలికి దూసుకు వెళ్ళగా లోపల సీఎం గారితో పాటు ఇతర రెడ్డి ప్రజా ప్రతినిధులు జీడిపప్పు తింటూ కూర్చున్నారని తెలిపారు. ఎవరైనా బీసీ, ఎస్సి నేతలు తాము కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి జీడిపప్పు తిన్నామని చెబితే అదంతా ఉత్తి అబద్ధమేనని, అదే నిజమైతే ఒక ఫోటోను విడుదల చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news