జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి – వైసీపీ ఎంపీ

-

జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, అదే తన కోరిక అని వెల్లడించారు వైసీపీ ఎంపీ రఘురామ. సింగిల్ గా వస్తానా?, కలసి వస్తానా అన్నది త్వరలోనే చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారని గుర్తు చేశారు. సింగిల్ గా పోటీ చేయమని పదే, పదే తమ పార్టీ నేతలు చేస్తున్న సవాళ్లపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారని వెల్లడించారు.

మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో ఇప్పటికే పార్టీ క్యాడర్ కలిసి పోయిందని, ఇక లీడర్లు కలవడం లాంచనంగా మిగిలి ఉందన్నారు. సాధారణంగా అయితే లీడర్లు కలుస్తారు కానీ పార్టీల క్యాడర్ కలవడం కష్టమని పేర్కొన్నారు. ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొందని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ.

Read more RELATED
Recommended to you

Latest news