గుడ్ న్యూస్ : జూన్ 6న రైతు రథం ప్రారంభం..6 వేల ట్రాక్టర్ల పంపిణీ

-

ఏపీ రైతులకు జగన్ శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. జూన్ 6వ తేదీన 6వేల ట్రాక్టర్ల పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఏపీ రైతులకు నాలుగో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి జగన్ అందించారని గుర్తు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

రైతులకు అనేక సేవలు, కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతు రథం పేరుతో కార్యక్రమాన్ని జూన్ 6న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారని ప్రకటన చేశారు.

ఆరు వేల ట్రాక్టర్లను ప్రారంభిస్తారని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతులు నేరుగా వాళ్ళకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ఆ మేరకు మాకు సమాచారం ఇచ్చిన తర్వాత సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మీడియా పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news