TDPకి ఓటేస్తే రూ.10కోట్లు ఇస్తామన్నారు : రాపాక సంచలన వ్యాఖ్యలు

-

TDP కి ఓటేస్తే రూ.10కోట్లు ఇస్తామన్నారని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం నాకే వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు టీడీపీ పదికోట్లు ఆఫర్‌ చేసింది. నా ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని పేర్కొన్నారు. నాకు డబ్బులు ఎక్కవై వద్దనలేదు.

నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్‌ఎన్‌ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని ఆరోపణలు చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్‌ ఉంటుందని చెప్పారన్నారు రాపాక వరప్రసాద్‌. అయితే.. ఇదే విషయంపై మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కామెంట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏమి మాట్లాడారో నాకు తెలియదు.. ఎమ్మెల్యేతో మాట్లాడి తెలుసుకుంటానని వివరించారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడానని వివరించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news