బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు…ఆ అస్త్రం తుస్సుమంది – రోజా

-

 

నారా బ్రాహ్మణిపై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందంటూ చురకలు అంటించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?? అని నిలదీశారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని.. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి రోజా.

Roja counter to Brahmini
Roja counter to Brahmini

మీ మామ ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా?! మీ తాత ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు ఏంటో అర్థం అవుతుందని మండిపడ్డారు. సాక్ష్యాధారాలు లేవు అని అంటోంది బ్రాహ్మణి…. ఒకసారి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఆధారాలు చూపిస్తారని ఆగ్రహించారు. బ్రాహ్మణికి చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని… చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనుకుంటుందా? లేక దేశానికి ప్రధానిగా చేశాడని అనుకుంటోందా?? అని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు ఏపీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news