హాయ్ ఏపీ.. బైబై బీపీ : మంత్రి రోజా సెటైర్లు

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి రోజా సెల్వమణి. హాయ్ ఏపీ.. బైబై బీపీ అంటూ పవన్‌ కళ్యాణ్‌, నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి.. మంత్రి రోజా సెటైర్లు విసిరారు. ‘హలో ఏపీ బై బై వైసిపి’ అని స్లోగన్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.

తాము గత ఎన్నికల్లో ఇచ్చిన ‘బై బై బాబు’ నినాదాన్ని పవన్ కాపీ కొట్టారని, బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. ‘హాయ్ ఏపీ… బై బై బిపి (బాబు, పవన్)’ నినాదాన్ని ప్రజలు అందుకుంటారని చెప్పారు. పవన్, చంద్రబాబు కలిసి వచ్చినా, విడిగా వచ్చిన తమకు భయం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ వచ్చేది మరోసారి జగన్‌ మోహన్‌రెడ్డి సర్కార్‌ అని… ఇందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news