ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…. టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్

-

ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి 10 రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ట్రిపుల్ ఆర్ సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీ బడ్జెట్ సినిమాకు మొదటి మూడు నాలుగు రోజుల్లోనే కలెక్షన్లు వచ్చేట్లు డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలు పెంచుకుంటారని.. ఇదే సమయంలో ప్రజలపై కూడా ఎక్కువ భారం పడకుండా చూడటం ప్రభుత్వం విధి అని ఆయన అన్నారు. ఇటు ప్రేక్షకులు, అటు సినిమా రంగానికి ఎవరికి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్ని నాని వెల్లడించారు. తొందరలోనే ట్రిపుల్ ఆర్ అప్లికేషన్ ను స్క్రూటినీ చేసి దానికి అదనంగా ఎంత ఇవ్వడం అనేదానిపై జీవో ఇస్తామని అన్నారు. సినిమాకు ఎంత ఖర్చు అయిందనే వివరాలను స్క్రూటిని చేసిన తర్వాతే టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆన్ లైన్ టికెట్ కోసం రెండు కంపెనీలు టెండర్లు వేశారని వెల్లడించారు. థియేటర్లలో 5 షోలు ప్రదర్శించే అవకాశం ఉందని.. అయితే పెద్ద సినిమా రిలీజ్ రోజు రూ. 20 కోట్ల బడ్జెట్ ఉన్న చిన్న సినిమాకు ఒక షో తప్పకుండా కేటాయించాలని ఆయన అన్నారు. వచ్చే సినిమాలు ఏపీలో 25 శాతం షూటింగ్ చేయాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news