శ్రీవాణి ట్రస్ట్ పై ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

-

తిరుమల: శ్రీవాణి ట్రస్ట్ పై ప్రశంసలు కురిపించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అంతర్జాతీయ ఆలయాల సమావేశం మరియు ఎగ్జిబిషన్ లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు మోహన్ భగవత్. శ్రీవాణి ట్రస్టు ద్వారా సేకరించిన నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో టీటీడీ ఆలయాలు నిర్మించడాన్ని అభినందించారు. చిన్న, మధ్య స్థాయి ఆలయాలను గుర్తించి.. ఆ ఆలయ సాంప్రదాయాలను ప్రాశస్త్యని ప్రజలకు తెలియచెప్పే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఆలయాల ద్వారా హిందూ మతం విలువలను తెలియజేయాలని.. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఆలయాల ద్వారా విద్యా, వైద్య సేవలు ప్రజలకు అందించాలని.. పేదవారి వైద్యానికి ఆలయాల నుండి సహకారం అందించాలన్నారు. భవిష్యత్తు తరాలకు మన సంప్రదాయాలు, సంస్కృతిని ఆలయాల ద్వారా అందించాలన్నారు మోహన్ భగవత్.

Read more RELATED
Recommended to you

Latest news