అశోకుడు చెట్లు నాటించాడు.. జగన్ చెట్లు నరికించాడు – సోమిరెడ్డి

-

నెల్లూరు జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్యలను తిట్టడానికే సీఎం జగన్ వెంకటగిరిలో బహిరంగ సమావేశం పెట్టారని మండిపడ్డారు. బహిరంగ సభలో పిల్లలు, మహిళలు, పెద్దలు ఉన్నారన్న విషయాన్ని మరిచి జగన్ మాట్లాడారని దుయ్యబట్టారు.

జగన్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని.. ఆయన ప్రెస్టేషన్లో ఉన్నాడని అన్నారు. నాటి గాంధీ నుండి నేటి మోడీ వరకు అందరూ ప్రజల్లోనే తిరుగుతున్నారని.. జగన్ మాత్రం ప్రాణభయంతో తిరుగుతున్నాడని అన్నారు. “అశోకుడు చెట్లు నాటించెను.. జగన్ చెట్లు నరికించెను” అంటూ ఎద్దేవా చేశారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరుకుతున్నారని జగన్ కి ముందే తెలుసని ఆరోపించారు సోమిరెడ్డి. వివేక హత్యకు రాజకీయ కారణాలు ఏంటనేవి ఆయన చెల్లి స్వయంగా చెప్పిందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికుండి ఉంటే ముసలోడు అని పిలవగలవా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news