ఉరే సరి: ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుచెప్పి ఇరికించేసిన హరి!

-

గతకొన్ని రోజులుగా సబ్బం హరి.. టీడీపీ అధికార ప్రతినిధులను తలదన్నే స్థాయిలో మాట్లాడుతున్నారన్న కామెంట్లు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమరవతిలోనే పూర్తి రాజధాని కాకుండా… పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన క్రమంలో తాజాగా మీడియా ముందుకు వచ్చారు సబ్బం హరి!

విశాఖవాసుల రుణం తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా తన్ని అన్నిరకాలుగా కాలదన్నుకుంటున్నారనే పేరు సంపాదించున్న సబ్బం హరి… తాజాగా అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు అమరావతి మార్చాలనే ఆలోచన రావడానికి అక్కడ “ఇన్ సైడ్ ట్రేడింగ్” జరగిందన్న అనుమానమే నిజమైతే… విచారణ చేపట్టాలని, అనంతరం అలాంటి తప్పుడు పనులకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని అంటున్నారు!

ఇంతకాలం తమకు తమ ప్రతినిధులకంటే బలంగా మీడియాలో టీడీపీకి మద్దతు పలికిన సబ్బం హరి… ఇలా బాంబు పేల్చే సరికి తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారంట. ఎవరు అవునన్నా కాదన్నా అమరావతి నిర్మాణం విషయంలో. రాజధాని భూముల్లో లెక్కలేనన్ని అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చోటుచేసుకున్నాయనేది వైకాపా నేతలు చెబుతున్న మాట! ఈ క్రమంలో ఇప్పటికే బాబు అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నా తుళ్లూరు రిటైర్డ్ తహసిల్ధార్ ని ఏసీబీ అధికారులు పట్టుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో… కచ్చితంగా అమరావతి భూముల సేకరణలో చాలా అక్రమాలే జరిగాయన్న టాపిక్ కు మరింత బలం చేకూరింది. ఆ విషయంపై ఇప్పటివరకూ టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదు! ఇదే క్రమంలో… అమరావతిని తొలగించినా పర్లేదు కానీ, ఆ విషయాలపై విచారణ జరగకుండా ఉంటే బాగున్ను అనుకునే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారన్నా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో సబ్బం హరి మాటలు బాబు & కో లను ఇరకాటంలో పాడేసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Latest news