విజయోత్సాహం.. పవన్ కల్యాణ్ ను పట్టుకుని ఏడ్చేసిన సాయిధరమ్ తేజ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆయన పార్టీ బరిలోకి దిగిన ప్రతిస్థానాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేనానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

మరోవైపు మెగా ఫ్యామిలీ కూడా పవర్ స్టార్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది.  ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్‌ హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్లారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌, తనయుడు అకీరా నందన్‌ ఉన్నారు. అక్కడికి చేరుకున్నాక సాయితేజ్‌ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్‌ చేసుకుని, అనంతరం ఎత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. సంబంధిత విజువల్స్‌ను పంచుకుంటూ ‘‘మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నా హీరో, గురువు’’ అని ఆయనపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news