ఈవీఎంల వద్ద భద్రత భేషుగ్గానే ఉంది : జనసేన

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మే 25న ఆరో విడత, జూన్ 01న ఏడో విడతతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోతాయి. జూన్ 04న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

దీంతో ఈవీఎంలు జూన్ 04 వరకు భద్రపరచనున్నారు. అయితే ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇవాళ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత భేషుగ్గా ఉందని తెలిపారు. మూడంచెల విధానాన్ని అమలు చేశారు. ఈవీఎంల వద్ద భద్రత సరిగ్గా లేదనే రూమర్స్ ఎవ్వరూ నమ్మకూడదన్నారు. కేంద్ర బలగాల స్ట్రాంగ్ రూమ్ వద్ద మొహరించాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news