రూ.10 లక్షలు విలువ చేసే నకిలీ సిగరెట్ల పట్టివేత

-

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీగా నకిలీ సిగరెట్లు పట్టుబడ్డాయి. బెంగళూరు నుండి గుంటూరు డైలీ పార్సెల్ సర్వీస్ కు చేరుకున్నాయి నకిలీ సిగరెట్లు. మంగళగిరి,  నరసరావుపేటలకు చెందిన,  మహేష్ సాయి రామ్ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరు నుండి నకిలీ సిగరెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. 

గుంటూరులో  భారీగా నకిలీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. బెంగళూరు నుండి గుంటూరు కు పార్సెల్ సర్వీస్ల ద్వారా దిగుమతి చేసుకుంటున్న నకిలీ సిగరెట్ ల ముఠాను గుర్తించారు విజిలెన్స్ అధికారులు. పాత గుంటూరు పరిధిలో ఉన్న ఓ డైలీ పార్సిల్ సర్వీస్ సెంటర్ కు నకిలీ సిగరెట్లు చేరుకున్నాయని గుర్తించిన అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు.  విజిలెన్స్ అధికారులను గమనించిన నిందితులు, మహేష్ , సాయి అనే ఇద్దరు వ్యక్తులు పార్సిల్ సర్వీస్ సెంటర్ నుండి పారిపోయారు. సుమారు పది లక్షల రూపాయలు విలువచేసే నకిలీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news