కేశినేని నాని పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్..!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేడి భగ్గుమంటుందనే చెప్పాలి. ఓ వైపు అధికార వైసీపీ.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవలే కేశినేని నాని టీడీపీకి.. ఎంపీ పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేశినేని నాని.. బుద్ధా వెంకన్నకు తరచూ మాటల యుద్ధం కొనసాగుతుంది.

తాజాగా బుద్ధా వెంకన్నకేశినేని నాని పై ఫైర్ అయ్యారు. కేశినేని నాని పచ్చి మోసగాడు అని.. టీడీపీలో అత్యంత అవినీతికి పాల్పడింది ఎవరో చెప్పాలంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న గరం అయ్యారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొంది ఇన్నాళ్లు కేశినేని నాని వైసీపీ కి కోవర్టుగా పని చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ టీడీపీ లో చేరేందుకు సిద్ధం అయితే.. అతనికి పార్టీ చేరకూడదని చెప్పింది కేశినేని కాదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో స్థిరంగా ఉండే వ్యక్తి కేశినేని కాదని.. పార్టీలు మారే వ్యక్తం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి డిపాజిట్ కూడా దక్కదంటూ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news