Ys Sharmila: షర్మిల పరువు తీసిన జగన్ అభిమాని..వీడియో వైరల్

-

కాంగ్రెస్ మీటింగులో షర్మిల పరువు తీశాడు జగన్ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కడపలో వైఎస్ షర్మిల ఓ కార్యకర్తని జగన్ ఏం చేసాడో చెప్పు దమ్ముంటే మాట్లాడు అని మైక్ ఇచ్చింది, ఆ కార్యకర్త మైక్ తీసుకొని సీఎం జగన్ చెప్పినవన్నీ చేశాడు..మీ మద్దతు కూడా జగన్‌కి ఇవ్వండని వైయస్ షర్మిలని డిమాండ్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Sharmila is a fan of defamed Jagan

కాగా,కడప పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఏపీ న్యాయ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వం అని షర్మిల పేర్కొన్నారు. మీ ప్రేమకు కృతఙ్ఞతలు. వైఎస్‌ఆర్‌ హయాంలో రైతు రారాజు.. ఆయన వారసులు అని చెప్పుకునే జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహించారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్‌ మోసం చేశారు. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news