నేను జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను – జొన్నలగడ్డ పద్మావతి

-

నేను జగన్ కోసమే రాజకీయా ల్లోకి వచ్చానన్నారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. నేను మాట్లాడిన మాటలు కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని.. నేను ఎవరిని ప్రశ్నించానో ఆ మీడియా సంస్థలు చెప్పాలని చురకలు అంటించారు. ప్రతి చిన్న విషయానికి సీఎం కార్యాలయానికి వెళ్ళాలి అనే బాధ ఉందని..ప్రతిసారి సీఎంఓ వరకు రావాల్సి ఉందని ఫేస్ బుక్ లైవ్ లో చెప్పానని తెలిపారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

Shinganamala MLA Jonnalagadda Padmavathy comments on cm jagan

అధికారులు కూడా ఒత్తిడి లో ఉన్నారని వివరించారు. నా మాటలు వక్రీకరించి..నేను సీఎం జగన్ ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు. నేను జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని..పార్టీకి నేను పూర్తి విధేయత తో ఉన్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది అన్న పద్మావతి…హైకమాండ్ ఆదేశాలతో మీడియాకు ఈ వివరణ ఇచ్చారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

Read more RELATED
Recommended to you

Latest news