ఏపీలో నిజాయితీకి పట్టిన దుస్థితిని ప్రపంచానికి చూపించండి : నారా బ్రాహ్మణి

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసిస్తూ.. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అంటూ వ్యవస్థలను నిలదీద్దామని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయానిక ిసంకెళ్లు కార్యక్రమంలో పాల్గొందాం. ఇవాళ రాత్రి 7 గంటలకు మీ చేతులకు తాళ్లతోనో, రిబ్బన్లతోనే, సంకెళ్లు వేసుకోండి. ఇళ్ల నుంచి వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి ఆ సంకెళ్లను చూపించండి. న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో మీరు పాల్గొన్న సందర్భాన్ని వీడియో చూసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఏపీలో నిజాయితీకి పట్టిన దుస్థితిని ప్రపంచానికి చూపించండి అంటూ బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

మరోవైపు నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట మనమంతా ఉన్నామని చాటిచెబుదామని ఆయన సతీమణి భువనేశ్వరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఇళ్ల నుంచి బటయికి వచ్చి సంకెళ్లను చూపించాలని.. వాటిని వీడియోలు, ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బాబాతోనే నేను అంటూ ప్రకటించాలని భువనేశ్వరి కోరారు. 

Read more RELATED
Recommended to you

Latest news