పవన్‌ – బాబు భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి…డైపర్లు వాడండి – సోమిరెడ్డి

-

పవన్‌ – బాబు భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి…డైపర్లు వాడండంటూ టీడీపీ నేత సోమిరెడ్డి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు, పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరి భేటీ పై వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అయితే, వైసీపీ నేతల ట్వీట్లకు టీడీపీ నేత సోమిరెడ్డి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు. బాబు-పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని.. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడండంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

పవన్‌ – బాబు భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి…డైపర్లు వాడండి – సోమిరెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news