చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలను జగన్‌ ఆదుకోవాలి – సోము వీర్రాజు

-

చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలను జగన్‌ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కందుకూరు ఘటన దురదృష్టకరమని.. తొక్కిసలాటలో 8 మంది మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తీవ్ర సంతాప వ్యక్తం చేశారు.

సభలు.. సమావేశాలకు రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల సభలకు కూడా తగు రీతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు సోము వీర్రాజు. రాజకీయ పార్టీ సభ అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news