ఆస్తి కోసం తండ్రిని కర్రలతో కొట్టి చంపేశారు…!

-

ఆస్తి కోసం తండ్రిని చంపారు కుమారులు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన తూమాటి సుబ్బారావు ను కొట్టి చంపారు కొడుకులు. మృతునికి నలుగురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చనిపోవడంతో రెండో కుమారునితో కలిసి జీవిస్తున్నాడు సుబ్బారావు. మృతునికి మొత్తం 11 ఎకరాల పొలం ఉంది.

కొడుకులకు 6 ఎకరాలు పంచి తన పేరిట ఐదు ఎకరాలు ఉంచుకున్నాడు మృతుడు. ఐదు ఎకరాలను కూడా పంచమని చివరి కొడుకులిద్దరూ ఒత్తిడి చేసారు. వినకపోవడంతో తండ్రిని కర్రలతో కొట్టి కొడుకులు చంపేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తాడికొండ పోలీసులు… ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news