జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించిన చిలుకూరు అర్చకులు !

-

మొయినాబాద్ మండలం లోని చిలుకూరు బాలాజీ దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం లో గరుడ సేవ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనని అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

ఈ సందర్భంగా సౌందర రాజన్ మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్న సమయంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఉండిన సానిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. అలానే దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాల కొరకు చిలుకూరు బాలాజీ పోరాటానికి తన ఎంపీల ద్వారా మద్దతు తెలపాలని జగన్ ని ఆయన కోరారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో వెంటనే ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తే విమర్శించే వాళ్ల నోళ్లు మూయించవచ్చునని ఆయన జగన్ కు సలహా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news