గుడివాడలో టెన్షన్.. టెన్షన్..నేడు చంద్రబాబ పర్యటన

-

కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణ నెలకొంది. నేడు గుడివాడలో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఇక అటు గుడివాడకు నేడు చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా గుడివాడలో రా కదలిరా సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక అటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం జరుగనుంది.

TDP Chief Chandrababu Naidu set to visit Gudivada

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో గుడివాడలో పొలిటికల్‌ రగడ చోటు చేసుకుంది. పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలోనే గుడివాడలో టెన్షన్ టెన్షన్‌ వాతావరణ నెలకొంది. అటు ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అన్న సంగతి తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news