ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..రూ.30 లకే టమోటాలు పంపిణీ చేసిన టీడీపీ

-

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..రూ.30 లకే టమోటాలు పంపిణీ చేసింది టీడీపీ పార్టీ. బెజవాడలో టీడీపీ అధ్వర్యంలో పేదలకు కిలో 30 రూపాయలకు టమోటాలు పంపిణీ చేశారు. టీడీపీ పార్టీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా అధ్వర్యంలో టమోటా లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ కిలో చొప్పున పంపిణీ చేశారు టీడీపీ నేతలు.

అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. టమోటా ధర అదుపులోకి వచ్చే వరకు ఇంటింటికి కిలో ఇవ్వాలని.. అప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గం లో కిలో ముప్పై రూపాయలు కే మేము టమోటా అందిస్తామన్నారు. పేదలకు అయితే పూర్తి ఉచితంగా టమోటాలు పంపిణీ చేస్తామని..జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టాడన్నారు. అంత డబ్బు ఏం చేసుకుంటావు.. పేద ప్రజలకు కొంతైనా పెట్టాలని…దోచుకున్న డబ్బు తీస్తే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయవచ్చని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చాక కుటుంబం లో ఒక్కో వ్యక్తి మీద. నెలకు నాలుగు వేల భారం పడిందని.. యేడాదికి లక్షా 82వేలు భారం మోపి, ఖాతాల్లో పది, ఇరవై వేలు వేసి గొప్పగా చెబుతావన్నారు. ఇక ప్రతిరోజూ 500కిలోల వరకు పేదలకు టమోటా పంపిణీ చేస్తామని ప్రకటించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news