ఫోన్ ట్యాపింగ్ పై టీడీపీ సీరియస్.. ఈసీకి లేఖ..!

-

ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కూడా ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ‘సార్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి.. చర్యలు తీసుకోండి’ అంటూ ఈసీకి ఏపీ టీడీపీ నేతలు లేఖ రాశారు.

కొన్ని రోజులుగా కొందరు అధికారులతో కలిసి వైసీపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్ల ట్యాప్పై ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కాగా కొందరు ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేతలు బోండా ఉమ, చిన్ని ఆరోపించారు. అంతేకాదు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. శనివారం జరిగిన టీడీపీలో సమావేశం ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్న పట్టుకున్నారు. దీంతో తమ ఫోన్లను కొందరు ఐపీఎస్ అధికారులు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news