ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ విచారణ..?

-

ఫైబర్ నెట్ అక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ఫిర్యాదు చేసారు. ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలని సీఎస్ ను కోరారు. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సహా ఆ సంస్ధలో పని చేసిన మరో ముగ్గురిని విచారించాలని కోరారు టీడీపీ ఎమ్మెల్సీ. గత ప్రభుత్వ హాయాంలో ఫైబర్ నెట్ తో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్ లాంత్రన్ సంస్థ ఎండీ శేషి రెడ్డిని విచారించాలని టీడీపీ బృందం తెలిపింది.

అయితే 2019-24 మధ్య కాలంలో ఫైబర్ నెట్ సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లో గోల్మాల్ చేసి.. ముంబైకి చెందిన బినామీ సంస్థలకు తరలించారు. ఫైబర్ నెట్ పేరుతో కోట్లు దండుకున్న మధుసూదన్ రెడ్డి దేశవ్యాప్తంగా బినామీలతో ఆస్తులు కూడగట్టుకున్నారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news