NDAలో చేరనున్న టీడీపీ పార్టీ – విజయసాయి ట్వీట్ వైరల్

-

NDAలో టీడీపీ పార్టీ చేరనున్నట్లు వస్తున్న వార్తలపై విజయసాయి రెడ్డి తన స్టైల్‌ లో స్పందించారు. టీడీపీ NDAలో చేరుతున్నట్లు ప్రచారం చేసిందీ, ముహుర్తాలు పెట్టిందీ మన పచ్చ కుల ఛానెళ్లు, పేపర్లేనంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాళ్లనే అడగమని అంటావేమిటి బాబూ? పొత్తుల కోసం పాకులాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా నష్టపోయానని ఏడిస్తే జనం నమ్ముతారా చంబా అన్నయ్యా అంటూ చురకలు అంటించారు.

కేంద్రం గ్రాంట్ ఇస్తే తట్టుకోలేరని… పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే వ్యతిరేకంగా లేఖలు రాస్తారు, ధర్నాలు చేయిస్తారు మా చంబా అన్నా, అయన గ్యాంగ్ అంటూ మండిపడ్డారు. తాను సీఎంగా ఉండగా కరెంట్ ఛార్జీలు పెంచారని ప్రశ్నిస్తే కాల్పులు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన బాబు కర్కశత్వంను జనం మర్చిపోరని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ‘విజనరీ’ ట్యాగును కుల మీడియా తగిలించింది చంబా అన్నకి. నిజస్వరూపం నయవంచన. మోసం. దగా. కులపిచ్చి. బందిపోటు కంటే దారుణమైన వ్యక్తి అని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news